September 23, 2007

ఎంత ప్రయత్నించినా తను అమాయకుడినని
ఒప్పుకోవట్లేదు సార్‌, హత్య చేశాననే అంటున్నాడు ఏం చేసేది
సందర్భం:
రియల్టరు ప్రశాంత్‌ రెడ్డి హత్య కేసు కొత్తమలుపు తిరిగింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు తనయుడు వెంకట్‌ ప్రధాన నిందితుడైన ఈ కేసులో... సీఐడీ ఉన్నట్టుండి బాంబు పేల్చింది. ప్రశాంత్‌రెడ్డిని తానే కాల్చి చంపినట్లు తమ ఇంటరాగేషన్లో వెంకట్‌ అంగీకరించాడని స్పష్టంచేసింది. ఈ మేరకు వెంకట్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశామని చెబుతూ... సీఐడీ పోలీసులు దాన్ని కోర్టుకు సమర్పించారు. ఈ ప్రతి మీడియాకు చిక్కటంతో అందులోని వివరాలు బయటపడ్డాయి.
మొదటి నుంచీ వెంకట్‌ తాను ప్రశాంత్‌రెడ్డిని హత్య చేయలేదని చెబుతూ వచ్చారు. ఫోరెన్సిక్‌ నివేదికలోనూ ప్రశాంతే ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. గన్‌ పౌడర్‌ ప్రశాంత్‌రెడ్డి భుజంపై పడిందని పేర్కొన్నారు కూడా. సీఐడీ కోర్టుకు అందజేసిన వెంకటరావు వాంగ్మూలంలో మాత్రం దీనికి భిన్నమైన వివరాలున్నాయి. ఈ నెల 18న మాసబ్‌ట్యాంక్‌ దగ్గరి తమ కార్యాలయంలో వెంకట్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, అక్కడొక కంప్యూటర్‌ ఆపరేటర్‌ మాత్రమే ఉన్నారని సీఐడీ ఆ నివేదికలో తెలిపింది.

No comments: