September 8, 2007

ఉత్తమ పార్లమెంటేరియన్లు

మరి మిగతావాళ్లు?
సందర్భం:
ప్రతిష్ఠాత్మక 'ఉత్తమ పార్లమెంటేరియన్‌' పురస్కారాలకు సీనియర్‌ ఎంపీలు శరద్‌పవార్‌, సుష్మాస్వరాజ్‌, చిదంబరం, మణిశంకర్‌ అయ్యర్‌లు ఎంపికయినట్టు విశ్వనీయంగా తెలిసింది. స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీతో కూడిన జ్యూరీ... 2003 నుంచి వరుసగా సంవత్సరాలకు వీరిని ఎంపిక చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి, సభా విలువల పరిరక్షణకు విశేషంగా కృషిచేసే ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. గత నాలుగేళ్లుగా ఈ అవార్డులను ప్రకటించడం లేదు. దీంతో తాజాగా ఒకేసారి 2003 నుంచి 2006 వరకు నలుగురు ఎంపీల పేర్లు ఖరారు చేశారు. ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ 2003కు, భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్‌ 2004కు, ఆర్థికమంత్రి చిదంబరం 2005కు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ 2006 సంవత్సరానికి ఎంపికయ్యారు. వీరి పేర్లను భారత పార్లమెంటరీ గ్రూప్‌ పాలకమండలి ఇంకా ఆమోదించాల్సి ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. చివరిగా, 2002లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డును ఎంపీ హోదాలో మన్మోహన్‌సింగ్‌ అందుకున్నారు.

No comments: